140 మిలియన్ వ్యూస్‌తో రికార్డు సృష్టిస్తున్న ‘2.0’

సోమవారం, 12 నవంబరు 2018 (20:13 IST)
సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సుభాష్ కరణ్ నిర్మిస్తున్న భారీ చిత్రం ‘2.0’. భారతీయ చలన చిత్ర చరిత్రలోనే తొలిసారి 600 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మాణం జరుపుకుంటున్న ఈ సినిమా నవంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో విడుదల కాబోతోంది. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను చెన్నైలో చాలా గ్రాండ్‌గా విడుదల చేశారు. 
 
ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయనేది ఈ ట్రైలర్‌కి వచ్చిన వ్యూస్ చూస్తే అర్థమవుతుంది. కేవలం పది రోజుల్లోనే 140 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి రికార్డు సృష్టించింది ‘2.0’. 14 కోట్ల మంది ఈ ట్రైలర్‌ను వీక్షించారంటే ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. 
 
 
సూపర్‌స్టార్ రజనీకాంత్ సరసన ఎమీ జాక్సన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ హీరో అక్షయ్‌కుమార్ విలన్ పాత్ర పోషించారు. ఈ చిత్రానికి సంగీతం: ఎ.ఆర్.రెహమాన్, సినిమాటోగ్రఫీ: నిరవ్‌షా, ఎడిటింగ్: ఆంటోని, నిర్మాత: సుభాష్ కరణ్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శంకర్.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు