రజనీ "2.O" ఓ మహాకావ్యం : అక్షయ్ కుమార్

గురువారం, 26 అక్టోబరు 2017 (07:03 IST)
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా, ఎస్.శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "2.O". గతంలో వచ్చిన 'రోబో'కు సీక్వెల్. ఈ చిత్రం ఆడియో వేడుకను గ్రాండ్ నిర్వహించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. 
 
ఈ నెల 27న దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాకు సమీపంలో బుర్జ్ పార్కులో 2.0 ఆడియో రిలీజ్ ఫంక్షన్‌ను నిర్వహించనున్నారు. ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రెహ్మాన్ లైవ్ ఫర్‌ఫార్మెన్స్‌తో ఈ ఈవెంట్ ప్రారంభం కానుంది. ఈ సినిమాలో అమీజాక్సన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్ విలన్ రోల్ పోషిస్తున్నాడు. 
 
ఈనేపథ్యంలో అక్షయ్ కుమార్ ఓ ట్వీట్ చేశారు. "ఇక.. 2.0 మ్యూజిక్ ఈవెంట్‌కు రెడీ అవ్వాలని... ఇంకా రెండు రోజులే ఉందని, ఈ మూవీ ఓ మహాకావ్యం" అంటూ బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ట్వీట్ చేశారు. 

 

Gear up for the music event of @2Point0movie, it's going to be nothing less than EPIC!
2.0 days to go

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు