'ఎన్టీఆర్ బయోపిక్‌'కు గ్లామర్ టచ్.. మోక్షజ్ఞ సరసన రకుల్

గురువారం, 19 జులై 2018 (15:38 IST)
స్వర్గీయ ఎన్టీరామారావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం "ఎన్టీఆర్ బయోపిక్". క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం భారీ తారాగణంతో భారీగా రూపుదిద్దుకుంటుంది. ఇప్పటికే ఈ చిత్రంలో ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్రలో విద్యాబాలన్‌ను తీసుకోగా, శ్రీదేవి పాత్రకోసం రకుల్‌ను ఎంపిక చేశారు.
 
ఇకపోతే, ఎన్టీఆర్‌తో ఎక్కువ చిత్రాలలో నటించిన హీరోయిన్స్ జాబితాలో జయసుధ, జయప్రదలు కూడా ఉన్నారు. ఈ ఇద్దరు ఎన్టీఆర్‌తో అనేక హిట్ చిత్రాల్లో కలిసి నటించారు. దీంతో జయసుధ, జయప్రద పాత్రల కోసం నవతరం హీరోయిన్లను ఎంపిక చేస్తున్నారట. శ్రీదేవి పాత్రలో రకుల్ ప్రీత్ ఎంపిక కావడంతో బయోపిక్‌కు గ్లామర్ వచ్చింది. ఇప్పుడు జయసుధ, జయప్రద పాత్రలకు నవతరం హీరోయిన్స్‌ను ఎంపిక చేస్తే.. బయోపిక్‌కు మరింత గ్లామర్ వచ్చినట్టే. 
 
ఇకపోతే, ఎన్టీఆర్ బ‌యోపిక్‌తో బాల‌య్య త‌న‌యుడు మోక్ష‌జ్ఙ ఆరంగేట్రం చేస్తున్న విషయం తెల్సిందే. చిత్రంలో ఎన్టీఆర్ చిన్న‌త‌నానికి సంబంధించిన స‌న్నివేశాల‌లో మోక్ష‌జ్ఞ క‌నిపించ‌నున్నాడ‌ట‌. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఆమె పాలు అమ్మే మహిళ పాత్ర‌లో క‌నిపించ‌నుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అంతేకాదు మోక్ష‌జ్ఞ‌తో క‌లిసి కొన్ని రొమాంటిక్ సీన్స్‌లో కూడా పాల్గొంటుంద‌ట‌. ప్ర‌స్తుతం ఫిలింన‌గ‌ర్‌లో చ‌క్క‌ర్లు కొడుతున్న ఈ వార్త‌పై క్లారిటీ రావ‌ల‌సి ఉంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు