బాలీవుడ్ సినిమాలు ఇక గోవిందా అనుకున్నారు.. పఠాన్‌తో సీన్ మారింది - ఆర్జీవీ

బుధవారం, 2 ఆగస్టు 2023 (22:13 IST)
రంగీలా, అమితాబ్ బచ్చన్ సర్కార్ వంటి హిట్ చిత్రాలను అందించిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. తాజాగా బాలీవుడ్ చిత్రసీమపై పాజిటివ్ కామెంట్స్ చేశాడు. ఓ ఇంటర్వ్యూలో ఆర్జీవీ మాట్లాడుతూ.. ఇకపై హిందీ సినిమాలు సక్సెస్ కావు అనే కోణాన్ని 'పఠాన్' మార్చేసింది.
 
పాన్ ఇండియా మూవీల ట్రెండ్ నడుస్తున్న వేళ.. జనాలు బాలీవుడ్‌ సినిమాల జోలికి పోరనే అభిప్రాయాన్ని 'ప‌ఠాన్‌' సినిమా మార్చేసింది. 'కాంతార‌', 'ఆర్‌ఆర్‌ఆర్‌', 'కేజీఎఫ్‌' వంటి సినిమాల జోరు నడుస్తున్న కాలంలో బాక్సాఫీస్ వద్ద పఠాన్ బ్లాక్ బస్టర్ హిట్ అందించిది. 
 
బహుశా రాజమౌళి ఒడిశాలోనో, గుజరాత్‌లోనో పుట్టి ఉంటే ఇలాంటి సినిమాలకు దర్శకత్వం వహించి ఉండేవాడు. ప్రస్తుతానికి తాను పొలిటికల్ థ్రిల్లర్ సినిమాపై దృష్టి పెడుతున్నాను. త్వరలో ఓ హిందీ చిత్రానికి దర్శకత్వం వహిస్తానని ఆర్జీవీ ప్రకటించాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు