భర్త దర్శకత్వంలో భార్య... ముద్దుసీన్లు ఉంటాయా? (video)

గురువారం, 17 అక్టోబరు 2019 (14:09 IST)
టాలీవుడ్ అగ్రనటి రమ్యకృష్ణ. ఈమె ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత కూడా ఆమె నటిగా రాణిస్తోంది. హీరోయిన్‌తో పాటు అత్త వేషాలు వేస్తూ యమబిజీగా ఉంది. ఈమె తొలిసారిగా భర్త కృష్ణవంశీ దర్శకత్వంలో నటించనుంది. అంటే 15 యేళ్ళ తర్వాత ఆమె తన భర్త దర్శకత్వంలో నిర్మించనుంది. మరాఠీ హిట్ చిత్రం 'నటసామ్రాట్'కు రీమేక్​గా రూపొందిస్తున్న ఈ సినిమాకు 'రంగమార్తాండ' అనే టైటిల్​ ఖరారు చేశారు. 
 
ఓ పోస్టర్​ను విడుదల చేశారు. ప్రధాన పాత్రలో ప్రకాశ్​రాజ్ కనిపించనున్నాడు. వీటితో పాటే చాలాకాలం తర్వాత కృష్ణవంశీ తీస్తున్న సినిమా ఇది కావడం వల్ల ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. 2017లో 'నక్షత్రం' తీశాడు కృష్ణవంశీ. సందీప్‌ కిషన్‌, సాయిధరమ్‌ తేజ్‌, రెజీనా తదితరులు నటించిన ఈ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది. ఆ తర్వాత మరో ప్రాజెక్టు పట్టాలెక్కించలేదీ డైరెక్టర్. ఇప్పుడు ఈ చిత్రం ప్రకటించాడు. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు