నాగచైతన్య, సమంత పెళ్ళి వేడుకకు అంతా సిద్ధమైనట్లు సంకేతాలు వచ్చేశాయి. టాలీవుడ్ అందాల జంట.. చైతూ, సమ్మూ ఆదివారం హైదరాబాద్లోని ఎన్ కన్వెన్షన్లో జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు. ప్రముఖ వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ కుమార్తె స్వాతికి, ఐటీసీ గ్రాండ్ కాకతీయ హోటల్ యజమాని శివకుమారెడ్డి కుమారుడు ప్రణవ్రెడ్డికి ఆదివారం అట్టహాసంగా వివాహం జరిగింది.
ఈ శుభకార్యానికి సినీ, రాజకీయ ప్రముఖులు విచ్చేశారు. ఈ వివాహ వేడుకకు టాలీవుడ్ అందాల జంట ప్రత్యక్షమైంది. చైతూ, సమంతలతో పాటు నాగసుశీల తదితరులు హాజరయ్యారు. ఈ పెళ్లి వేడుకకు చైతూ, సమంతనే స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. వాటికి అవుననో, కాదనో వారు తేల్చిచెప్పలేదు.