ఉలగనాయకన్ కమల్ హాసన్ ముద్దుల గారాలపట్టి శృతిహాసన్. నటనలో తండ్రికి తగ్గ తనయురాలు అని పించుకుంది. అయితే, ఈమె దక్షిణాదికి చెందిన నటుడి కుమార్తె అయినప్పటికీ.. సినీ కెరీర్ మాత్రం బాలీవుడ్లో ప్రారంభమైంది. కానీ అక్కడ సక్సెస్ లేక సౌత్ బాట పట్టింది.
ఆ తర్వాత 'అనగనగా ఓ ధీరుడు' అనే మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం ఫ్లాప్ కావడంతో షాక్కు గురైంది. తర్వాత సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ 'దిల్' రాజు 'ఓ మై ఫ్రెండ్' మూవీ కూడా శృతికి సక్సెస్ ఇవ్వలేకపోయింది. ఇక శృతికి ఐరెన్ లెగ్ ముద్ర పడడం పక్కా అనే టైంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పక్కన హీరోయిన్గా ఆఫర్ వచ్చింది. 'గబ్బర్ సింగ్' బ్లాక్బస్టర్ హిట్ కావడంతో ఫస్ట్ టైం శృతి సక్సెస్ రుచి చూసింది. ఆ తర్వాత 'శ్రీమతుండు' సూపర్ డూపర్ హిట్ అయింది.
దీనిపై ఆమె స్పందిస్తూ... 'వరుస ఫ్లాప్స్లో వున్న నాకు పవన్ 'గబ్బర్ సింగ్' మూవీతో లిఫ్ట్ ఇచ్చారు. అందుకే నా ఫిల్మ్ కెరీర్లో పవన్కి స్పెషల్ ప్లేస్ వుంటుంద'ని అంటోంది. 2012లో ఆ మూవీ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు 'కాటమరాయుడు' మూవీలో పవన్ పక్కన రెండోసారి కథానాయికగా చేస్తోంది. ఈ చిత్రం కూడా 'గబ్బర్ సింగ్' మ్యాజిక్ రిపీట్ చేస్తుందని శృతి కాంఫిడెంట్గా ఉంది.