ప్రసిద్ధ గాయకుల్లో సోనూ నిగమ్ ఒకరు. ఇటీవలే సింగర్ అర్జిత్ సింగ్కు పద్మ శ్రీ అవార్డ్ రావడంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో విమర్శకులకు గురైయ్యాడు. తాజాగా సోనూ నిగమ్ ఆసుపత్రిలో చేరారు. వెన్నునొప్పి తీవ్రంగా బాధించినప్పటికీ అతడు తన ప్రదర్శనను కొనసాగించాడు. నొప్పి మరింత తీవ్రం కావడంతో సంగీత కచేరి అనంతరం ఆసుపత్రిలో చేరారు.