నాగార్జున కోసమే శ్రీముఖి తప్పుకుందా?

శనివారం, 18 మే 2019 (16:14 IST)
తెలుగులో బుల్లితెర యాంకర్లు అనసూయ, సుమ, రేష్మీల తర్వాత అంతటి పాపుల అయిన యాంకర్ శ్రీముఖి. ఈమె బుల్లితెరకు మరింత గ్లామర్ తీసుకొచ్చిన ముద్దుగుమ్మ. బుల్లితెరపై ఆమె చేసే అల్లరి యూత్‌కి విపరీతంగా నచ్చుతుంది. ఫలితంగానే ఆమె చేస్తున్న పటాస్ ప్రోగ్రామ్‌ మంచి పాపులర్ అయింది. 
 
నిజానికి ఈ కార్యక్రమాన్నిశ్రీముఖి కోసమే చూస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి శ్రీముఖి ఈ షో నుంచి కొంతకాలం పాటు బ్రేక్ తీసుకుంది. ఈ వార్త వినగానే ఆమె ఫ్యాన్స్ ఒకింత నిరాశకు లోనయ్యారు.
 
ఆమె ఇలా హఠాత్తుగా బ్రేక్ తీసుకోవడానికి కారణమేమై ఉంటుందా అని అభిమానులు ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చిందట. 'బిగ్ బాస్-3' సీజన్‌లో పాల్గొనే అవకాశం శ్రీముఖికి వచ్చిందట. ఆ షోలో పాల్గొనడం కోసమే ఆమె బ్రేక్ తీసుకుందనేది తాజా సమాచారం. 
 
టాలీవుడ్ అగ్ర హీరో అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించనున్న ఈ షో, జూలై రెండో వారంలో ప్రారంభం కానుందని సమాచారం. సో.. శ్రీముఖి అల్లరి బిగ్ బాస్ హౌస్‌లో ఇకపై వంద రోజుల పాటు చూడొచ్చన్నమాట. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు