షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోందని చిత్ర నిర్మాత - దర్శకుడు శివరాజ్ కనుమూరి తెలిపారు. చిత్ర సమర్పకులు ఏ.వి.ఎస్.రాజు మాట్లాడుతూ... "కరీంనగర్, పోచంపల్లి, కాకినాడ, వైజాగ్, భీమిలి మొదలగు లొకేషన్స్లో ఈ చిత్రం షూటింగ్ జరుపుకొందని, ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని" అన్నారు.
ఈ చిత్రానికి సంగీతం: రవిచంద్ర, కెమెరా: నాగేష్ బన్నేల్, ఎడిటింగ్: ఎడిటర్ వెంకట్, సహ నిర్మాత: సతీష్ కనుమూరి, నిర్మాణం-దర్శకత్వం: శివరాజ్ కనుమూరి.