హాస్యభరిత చిత్రం... "జయమ్ము నిశ్చయమ్మురా.."

బుధవారం, 14 సెప్టెంబరు 2016 (16:26 IST)
"గీతాంజలి" తర్వాత శ్రీనివాస్ రెడ్డి "రాజు గారి గది" తర్వాత పూర్ణ జంటగా నటిస్తున్న నేటివిటీ హాస్యభరిత చిత్రం "జయమ్ము నిశ్చయమ్మురా". తెలుగు ప్రజలంతా ఒకే రాష్ట్రంలో ఉన్న రోజుల్ని గుర్తుకు తెస్తూ... 2013 నేపథ్యంలో - కరీంనగర్ నుంచి కాకినాడ వెళ్లిన ఓ యువకుడి చుట్టూ సాగే సరదా కథే "జయమ్ము నిశ్చయమ్మురా". 
 
షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోందని చిత్ర నిర్మాత - దర్శకుడు శివరాజ్ కనుమూరి తెలిపారు. చిత్ర సమర్పకులు ఏ.వి.ఎస్.రాజు మాట్లాడుతూ... "కరీంనగర్, పోచంపల్లి, కాకినాడ, వైజాగ్, భీమిలి మొదలగు లొకేషన్స్‌లో ఈ చిత్రం షూటింగ్ జరుపుకొందని, ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని" అన్నారు. 
 
ఈ చిత్రానికి సంగీతం: రవిచంద్ర, కెమెరా: నాగేష్ బన్నేల్, ఎడిటింగ్: ఎడిటర్ వెంకట్, సహ నిర్మాత: సతీష్ కనుమూరి, నిర్మాణం-దర్శకత్వం: శివరాజ్ కనుమూరి. 

వెబ్దునియా పై చదవండి