ఎందరో కప్పల్లాంటి వ్యక్తులను ముద్దుపెట్టుకున్నా.. తాప్సీ

బుధవారం, 11 సెప్టెంబరు 2019 (15:48 IST)
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు - మంచు మనోజ్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ఝుమ్మంది నాదం. ఈ చిత్రం ద్వారా తెలుగు వెండితెరకు పరిచయమైన హీరోయిన్ తాప్సీ. ఈ సినిమా తర్వాత మిస్టర్ ఫర్ఫెక్ట్, వీరా, మొగుడు వంటి చిత్రాల్లో నటించింది. అయితే, ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాపడ్డాయి. దీంతో ఈ అమ్మడుకి ఆశించిన గుర్తింపురాలేదు. ఫలితంగా ఆమె తన మకాంను బాలీవుడ్‌కు మార్చేసింది. 
 
అక్కడ మంచి కథాంశంతో ఉన్న చిత్రాల్లో నటిస్తూ స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది. అయితే కొన్నాళ్ళుగా తాప్సీ ప్రేమాయ‌ణంకి సంబంధించి ప‌లు వార్త‌లు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. వీటిపై ఆమె క్లారిటీ ఇచ్చింది. 
 
తాప్సీ త‌న సోదరి షగున్‌తో కలిసి తాజాగా ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో తన మనసులోని రాజకుమారుడి గురించి కూడా లీక్ చేసింది. తాను ఓ వ్యక్తితో ప్రేమించినట్టు, అయితే, తాను ప్రేమించే వ్యక్తి ఓ నటుడని తెలిపింది. క్రికెటర్ మాత్రం కాదని తెలిపింది. పైగా, అస‌లు భారతీయుడే కాదు అని చెప్పి అంద‌రికి షాకిచ్చింది. 
 
'ఎందరో కప్పల్లాంటి వ్యక్తులను ముద్దుపెట్టుకున్న తర్వాతే నాకు నా రాజకుమారుడు దొరికాడు' అని తనదైనశైలిలో సమాధానం ఇచ్చింది. అయితే 'నాకు పిల్లలు కావాలి అనుకున్నప్పుడే నేను పెళ్లి చేసుకుంటాను. పెళ్లి కాకుండా మాత్రం పిల్లల్ని కనను. అలాగని నా పెళ్లి ఆడంబరాలతో ఉండకూడదు. కుటుంబ స‌భ్యులు, స్నేహితుల మ‌ధ్య స‌ర‌దాగా జ‌ర‌గాలి' అని ఆమె స్ప‌ష్టం చేసింది.
 
కాగా, తాప్సీ చెబుతున్న వ్యక్తి డెన్మార్క్‌కు చెందిన బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోనా అని పలువురు అంటున్నారు. కానీ, తాప్సీ మాత్రం సినీ నటుడని చెప్పడంతో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు