బిగ్ బాస్ తెలుగు 8వ సీజన్ కంటెస్టెంట్లు వీరేనా?

ఠాగూర్

శనివారం, 31 ఆగస్టు 2024 (10:23 IST)
రెండు తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బాస్ రియాలిటీ షో బాగా పాపులర్ అయింది. ఈ షో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. ఆదివారం నుంచి అట్టహాసంగా ప్రారంభంకానుంది. ఈ బిగ్ బాస్ రియాలిటీ షోకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. షోలో ఈసారి ఎంత మంది పార్టిసిపేట్ చేస్తున్నారు.. ఫస్ట్ ఫేజ్‌లో ఎంత మంది లోపలికి వెళతారు. ఎవరెవరు కన్ఫర్మ్ అవుతారు అనే దానిపై సోషల్ మీడియాలో రకరకాలుగా ఊహగానాలు చెలరేగుతున్నాయి.
 
సాధారణంగా బిగ్ బాస్‌లో ఎప్పుడూ కూడా 15 మందికి పైగా కంటెస్టెంట్‌లు ఉంటారు. అయితే ఈసారి మాత్రం అందుకు భిన్నంగా ఉంటుందని సమాచారం. మొదటి దశలో 14 మందిని పంపిస్తున్నారు. అయితే 15 వారాల షోకి 14 మందిని తీసుకుంటే చాలా మందిని వైల్డ్ కార్డు ద్వారా లోపలికి పంపాల్సి ఉంటుంది. దాదాపు 5 నుంచి 6 మంది హౌస్‌లోకి వచ్చే అవకాశం ఉంటుంది.
 
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం మేరకు.. తన ఇన్‌స్టా వీడియోల ద్వారా పాపులర్ అయిన బేబక్క, హీరో ఆదిత్య ఓం, కృష్ణ ముకుందా మురారి సీరియల్ ద్వారా ఫేమస్ అయిన యష్మి గౌడ, ప్రేరణ కంభం, విష్ణు ప్రియ, అభయ్ నవీన్, ఢీనైనిక, కిర్రాక్ సీత బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తున్నట్లుగా సమాచారం.
 
అలానే శేఖర్ బాషా, నాగమణికంఠ, నిఖిల్ కూడా మంచి పొటెన్షియల్ ఉన్న కంటెస్టెంట్స్‌గా భావిస్తున్నారు. తొలుత రీతూ చౌదరి, తేజస్విని గౌడ, అంజలి పవన్, ఇంద్రనీల్, కుమారి ఆంటీ, రామిశెట్టి, కిరాక్ ఆర్పీ లు బిగ్ బాస్ సీజన్ 8లో కంటెస్టెంట్‌లుగా ఉంటారని సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేశాయి. అయితే వీరు ఎవరూ హౌస్‌లోకి వెళ్లడం లేదన్నది తాజా సమాచారం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు