పుష్పతో సుడి తిరిగిందనుకుంటే.. రష్మికకు ఆ ఛాన్స్ మిస్సయ్యిందే..

మంగళవారం, 30 ఆగస్టు 2022 (10:49 IST)
పుష్ప సినిమా హిట్ కావడంతో నార్త్‌లో రష్మిక క్రేజ్ పెరిగిపోయింది. బాలీవుడ్ సీనియర్ నటుడు జాకీష్రాఫ్ వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన టైగర్ ష్రాఫ్ ఇప్పటికే స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. వీరిద్దరి కాంబినేషన్లో కరణ్ జొహార్ నిర్మిస్తున్న 'స్క్రూ ఢీలా' చిత్రం షూటింగ్ జరగాల్సింది. కానీ ఆగిపోయింది. 
 
'స్క్రూ ఢీలా' చిత్రాన్ని రూ. 35 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుని చేసేందుకు కాంట్రాక్ట్ అగ్రిమెంట్‌పై టైగర్ ష్రాఫ్ సంతకం చేశాడు. అయితే, పారితోషికాన్ని తగ్గించుకోవాలని.. లాభాల్లో వాటా తీసుకోవాలని టైగర్‌ను కరణ్ జొహార్ కోరారు. 
 
రూ.20 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోవాలని చెప్పారు. అయితే టైగర్ ష్రాఫ్ ఒప్పుకోకపోవడంతో సినిమా ఆగిపోయింది. దీంతో రష్మిక ఒక బాలీవుడ్ సినిమాను కోల్పోయినట్టయింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు