ఆ యువతి ఛాన్సివ్వడం వల్లే అత్యాచారం జరిగింది : భాగ్యరాజ్

బుధవారం, 27 నవంబరు 2019 (13:14 IST)
తమిళ సీనియర్ హీరో భాగ్యరాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఫలితంగా ఆయన మహిళాలోకం ఆగ్రహాన్ని చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంతకీ భాగ్యరాజ్ చేసిన వ్యాఖ్యలు ఏంటో ఓసారి పరిశీలిద్దాం. 
 
ఇటీవలి కాలంలో మహిళలు వివాహేతర సంబంధాలు పెట్టుకుని భర్తలు, పిల్లల్ని చంపేస్తున్నారు. పైగా, మొబైల్ ఫోన్ల వల్ల మహిళలు చెడిపోతున్నారని.. రెండేసి సిమ్ కార్డులు వాడుతున్నారన్నారు. వారిపై జరుగుతున్న అత్యాచారాలకు ఇవి కూడా ఓ కారణంగా ఉన్నాయన్నారు. 
 
పైగా ఇటీవల తమిళనాడు రాష్ట్రంలోని పొల్లాచ్చిలో ఓ యువతిపై జరిగిన అత్యాచార ఘటనలో మగవాళ్ళ తప్పు ఏమాత్రం లేదన్నారు. ఆ అమ్మాయి అవకాశం ఇచ్చినందువల్లే రేప్ జరిగిందని చెప్పుకొచ్చారు. తాను ఉమ్మడి కుటుంబం నుంచి వచ్చినందువల్లే తన సినిమాల్లో మహిళలకు అధిక ప్రాధాన్యతను ఇచ్చానని గుర్తు చేశారు. 
 
ఈ వ్యాఖ్యలు ఇపుడు వివాదాస్పదంగా మారాయి. దీంతో భాగ్యరాజ్‌పై మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళలపై అత్యాచారాలు జరుగుతుంటే... పురుషుల తప్పేమీ లేదని అంటారా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ దుమారం ఎంత దూరం వెళ్తుందో వేచి చూడాలి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు