నాగచైతన్య, సాయిపల్లవి నటించిన తండేల్‌ రివ్యూ

దేవి

శుక్రవారం, 7 ఫిబ్రవరి 2025 (12:54 IST)
Saipallavi, nagachitanya
నాగచైతన్య, సాయిపల్లవి నటించిన తండేల్‌ సినిమా నేడే విడుదలైంది. చందుమెండేటి దర్శకుడు. కార్తికేయ 1,2, సవ్యసాచి చిత్రాలకు  దర్శకత్వం వహించిన ఈయన అల్లుఅరవింద్‌ సమర్పణలో  తెరకెక్కించారు. తండేల్‌ అనేది మత్సకారుల జీవితాల్లో నాయకుడిగా ఎదిగిన వ్యక్తి. 2019లో జరిగిన ఓ రియల్‌ స్టోరీతో సినిమా తీశామనిచెప్పారు. మరి ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
 
కథ: 
వైజాగ్‌ సమీపంలోని సీకాకులం సముద్రతీరంలోని పల్లెకారుల కుటుంబంలో జరిగిన కథ. రాజు (నాగచైతన్య), చిన్నప్పటినుంచి అక్కడే పెరిగిన సత్య ఉరఫ్‌ బుజ్జితల్లి (సాయిపల్లవి)ని ప్రేమిస్తాడు. వేటకు  వెళితే నెలలతరబడి తిరిగిరారు. అలాంటి వారి జీవితాల్లో రాజు, సత్యలు ప్రేమతో ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. అలాంటిది ఇకపై వేటకు  వెళ్ళవద్దని రాజుతో సత్య మాట తీసుకుంటుంది. కానీ రాజు వేటకోసం గుజరాత్‌ వెళతాడు. అక్కడ సముద్రంలో తుఫాన్‌ కారణంగా దారి తప్పి పాకిస్తాన్‌ బోర్డర్‌ కు చేరుకుంటారు. ఆ తుఫాన్‌ లో పాకిస్తాన్‌ బోట్‌ లో ఓ వ్యక్తిని  రక్షిస్తాడు. పాకిస్తాన్‌ కోస్ట్‌ గార్డ్‌ రాజుతో పాటు 21మందిని  అరెస్ట్‌ చేస్తారు. మరోవైపు సత్యను వేరే వ్యక్తికి ఇచ్చి పెండ్లిచేయడాని కి సత్య తండ్రి ప్రుద్వీ నిర్ణయిస్తాడు. ఆ తర్వాత కథ ఎటువైపు మలుపుతిరిగింది? అనేది మిగిలిన సినిమా.
 
సమీక్ష:
మొదటి భాగమంతా రాజు, సత్యల ప్రేమమీదనే కథ సాగుతుంది. వేటకు వెళ్ళినా రాజు మనస్సంతా సత్య దగ్గరే వుంటుంది. ఫోన్లమీద ఫోన్లు చేస్తూ ఓ దశలో చిరాకు తెప్పిస్తాడు. ఇదే డైలాగ్‌ ను సత్యచేత దర్శకుడు చెప్పిస్తాడు. సాదా లవ్‌ కథలో మలుపు అనేది ఇంటర్‌ వెల్‌ కు ముందు వచ్చేది. సెకండాఫ్‌ లో ఆసక్తిగా కథను నడపడంలో దర్శకుడు ఫెయిల్యూర్‌ అయ్యాడనే చెప్పాలి. ఎక్కడా ఫీలింగ్‌ కలగదు. 
 
ఈ సిఁమాను చూస్తుంటే మణిరత్నం రోజా సిఁమా గుర్తుకు రాకమానదు. భర్త అరవింద్‌ కోసం భార్యగా మధుబాల చేసిన పోరాటం కానీ పడిన స్ట్రగుల్‌ కానీ సత్యలో కనిపించినా దర్శకఁడు అంత ఫీల్‌ కలిగించలేకపోయాడు. అరవింద్‌ స్వామి పాకిస్తాన్‌ టెర్రరిస్టులనుంచి విడుదలవుతాడా? లేదా? అనేది గూజ్‌ బంప్స్‌ చూసేవారికి క్రియేట్‌ చేస్తాయి. ఇందులో కూడా పతాకసన్ని వేషంలో  ఓ వ్యక్తికోసం రాజు చేసే దీక్ష వున్నా అంత ఫీల్‌ రాదు. దానికి నటీనటుల్లో లోపంకూడా ఓ కారణంగా కనిపిస్తుంది.ఇక సిఁమాకు కెమెరాపనితనం, సంగీతం ప్రధాన హైలైట్‌గా చెప్పవచ్చు. నేపథ్య సంగీతం బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. కథనంలో చిన్నపాటి లోపాలు కనిపిస్తాయి. అందరూ వద్దన్నా  పాకిస్తానీ జాలరీని రక్షించే కంగారులో బోర్డర్‌ దాటేస్తారు రాజు టీమ్‌. 
 
ఇక ఆ పాత్ర తాను పాకిస్తానీ అని  పోలీసులకు, కానీ కోర్టుముందు కానీ చెప్పించకపోవడం చిత్రంగా అనిపిస్తుంది. ఇక పాకిస్తాన్‌ జైలులో వుండే తీవ్రవాదులు క్రూయల్‌ మెంటాలిటీ కొద్దిగా చూపించే ప్రయత్నం చేసినా దాన్ని  మరింత హైలైట్‌ చేస్తే బాగుండేది. తీవ్రవాదులు ఇండియన్‌ ఖైదీలంటే దారుణంగా ట్రీట్‌ చేస్తారు. అలా చాలా కథలు పేపర్లలో వచ్చాయి. క్లయిమాక్స్‌ సుఖాంతం అవుతుందనే అందరికీ తెలిసిందే. ఎలా అయింది అనేది దర్శకఁడి ప్రతిభ. సత్య ఢిల్లీవరకు  వెళ్ళి రాజు కోసం చేసే పోరాటం సినిమాలో కీలకం. ఆమె నటన,  నాగచైతన్య నటన చాలా బాగుంది. ఇద్దరి కెమిస్ట్రీ చూడ్డానికి బాగుంది. ఎటొచ్చీ దర్శకఁడు మరింత కథనంపై కసరత్తు చేయాల్సింది.
రేటింగ్‌ 2/5

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు