రెండేళ్లుగా పింఛన్ వస్తలేదు బిడ్డా: కలెక్టరుతో వృద్ధ మహిళ

గురువారం, 27 ఫిబ్రవరి 2020 (12:34 IST)
ఏంటి పెద్దమ్మా ఇక్కడ కూర్చున్నావ్? మహిళతో కలెక్టర్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్‌కు వచ్చి ఓ గిరిజన వృద్ధురాలు మెట్లపై కూర్చుంది. అధికారుల కోసం చాలా సేపు వేచి ఉంది. అంతలో విధుల్లోకి వస్తున్న కలెక్టర్ మహ్మద్ అబ్దుల్ ఆజిం ఆ వృద్ధురాలిని చూసి, ఆమె కూర్చున్న మెట్లపైనే ఆమె పక్కన కూర్చుని పెద్దమ్మా ఏం కావాలి.. ఇక్కడికి ఎందుకొచ్చారని అడిగారు.
 
ఆయన కలెక్టర్ అని కూడా తెలియని ఆ వృద్ధురాలు సామాన్యునితో మాట్లాడినట్లే 'రెండేండ్ల నుండి పింఛన్ వస్త లేదు బిడ్డా. సారును కలుద్దమని వచ్చినా' అన్నది.
 
ఎంతో ఆప్యాయంగా అమెతో మాట్లాడి ఇబ్బందులు తెలుసుకున్న కలెక్టర్ వెంటనే డీఆర్డీఓకు ఫోన్ చేసి వివరాలు చెప్పి ఆ వృద్ధురాలికి పింఛన్ మంజూరు చేయించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు