బాలీవుడ్ 'దేవదాసు' దిలీప్ కుమార్ ఇక లేరు

బుధవారం, 7 జులై 2021 (10:30 IST)
బాలీవుడ్‏ లెజెండరీ యాక్టర్ దిలీప్ కుమార్ (98) బుధవారం (జూలై 7న) తుదిశ్వాస విడిచారు. జూన్ 30వ తేదీన ఆయన శ్వాస సంబంధిత సమస్యలతో ముంబైలోని ఓ ఆసుపత్రిలో చేరగా, ఊపిరితిత్తుల్లో చేరిన నీటిని తొలగించారు.
 
దాంతో దిలీప్ కుమార్ ఆరోగ్యం మెరుగుపడిందని.. ప్రస్తుతం బాగున్నారని ఇటీవల ఆయన భార్య సైరా భాను సోషల్ మీడియా వేదికగా పేర్కోన్నారు. మళ్లీ ఆయన అనారోగ్యం బారిన పడటంతో ఈరోజు ఉదయం 07.30కి కన్ను మూశారు.  
దిలీప్ కుమార్ అసలు పేరు మహమ్మద్ యూసఫ్ ఖాన్. 1922 డిసెంబర్ 11 పెషావర్‌లో జన్మించారు. 8సార్లు ఉత్తమ ఫిలింఫేర్ అవార్డు అందుకున్న దిలీప్ కుమార్ మొగలి ఏ ఆజమ్, క్రాంతి, రామ్ ఔర్ శ్యాం, ఖర్మ, అందాజ్ వంటి హిట్ చిత్రాల్లో నటించారు. 1991లో దిలీప్ కుమార్‌ పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు. 
1994లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు. 1955 దేవదాసు చిత్రంతో దిలీప్ కుమార్‌కు దేశవ్యాప్తంగా గుర్తింపు. 2015 దిలీప్ కుమార్‌కు పద్మవిభూషణ్ పురస్కారం. కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న ఆయన  చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు హిందూజా ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. 
 
ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న ఆయన గత నెల ఆరో తేదీన శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తడంతో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు