కుమార్తెతో కలిసి ఎమ్మెల్యే రోజా ఫోటో షేర్, మేడమ్... మీ ఆరోగ్యం ఎలా వుంది?

శుక్రవారం, 30 ఏప్రియల్ 2021 (13:11 IST)
ఫోటో కర్టెసీ- ఫేస్ బుక్
ఎపిఐఐసి ఛైర్ పర్సన్, నగరి ఎమ్మెల్యే రోజా చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో శస్త్ర చికిత్స చేసుకున్న తర్వాత మరోసారి సోషల్ మీడియాలో తన కుమార్తెతో కలిసి ఫోటోలు షేర్ చేసుకున్నారు. ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు... మేడమ్, మీ ఆరోగ్యం ఎలా వుంది అంటూ ప్రశ్నలు వేశారు.
కాగా ఇటీవలే రోజా చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో శస్త్ర చికిత్స చేయించుకున్నారు. డిశ్చార్జ్ అయి తన నివాసానికి వచ్చేశారు. తన ఆరోగ్యంపై ఒక వీడియోను తీసి ఆమే అభిమానులకు పంపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు