కుక్కల నుంచి తప్పించుకుని.. ఏటీఎంలోకి జింక

మంగళవారం, 13 డిశెంబరు 2022 (18:31 IST)
శునకాల గుంపు నుంచి తప్పించుకున్న జింక ఏటీఎంలో చిక్కుకుంది. ఆ జింకను వన్యప్రాణి అధికారులు రక్షించారు. వివరాల్లోకి వెళితే..  కుక్కల బారి నుంచి తప్పించుకునేందుకు జింక గుజరాత్‌లోని అమ్రేలిలోని ఏటీఎం వెస్టిబ్యూల్‌లో చిక్కుకుపోయింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 
 
ఆ వీడియోలో జింక శునకాల నుంచి తప్పించుకుని.. ఏటీఎంలోకి వెళ్లిపోయింది. దాని నుంచి బయటికి రాలేకపోయింది. ఏటీఎం నుంచి బయటికి వచ్చేందుకు ప్రయత్నించింది. స్థానికులు సమాచారం ఇవ్వడంతో  అటవీ శాక అధికారులు దానిని సురక్షితంగా కాపాడి.. అటవీ ప్రాంతంలో వదిలివేయడానికి తీసుకెళ్లారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు