కేంద్ర బడ్జెట్ 2021-22 : 15 యేళ్లుదాటిన వాహనాలు ఇక తుక్కుకిందకే...

సోమవారం, 1 ఫిబ్రవరి 2021 (12:15 IST)
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్ 2021-22 వార్షిక సంవత్సరానికిగాను వార్షిక బడ్జెట్‌ను సోమవారం లోక్‌సభలో ప్రవేశపెడుతున్నారు. ఆమె ప్రసంగంలోని కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే, 
 
* రెగ్యులేటర్‌ గోల్డ్‌ ఎక్స్ఛేంజీల ఏర్పాటు
* ఇన్వెస్టర్‌ చార్టర్‌ ద్వారా ఇన్వెస్టర్ల ప్రయోజనాల పరిరక్షణ
* బీమారంగంలో FDIలు 49 శాతం నుంచి 74 శాతానికి పెంపు
* ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ వ్యవస్థలో సంస్కరణలు
* 1938 బీమా చట్టం సవరణ. డిపాజిట్లపై బీమా పెంపు
* విద్యుత్‌ పంపిణీ రంగంలో మరిన్ని సంస్థలు
* రూ.3,05,984 కోట్లతో డిస్కమ్‌లకు సాయం
* హైడ్రోజన్‌ ఎనర్జీపై దృష్టి
* ఇండియన్‌ షిప్పింగ్‌ కంపెనీకి రూ.1624 కోట్లు
* నౌకల రీసైక్లింగ్‌ సామర్థ్యం పెంపు
* రూ.18వేల కోట్లతో బస్‌ట్రాన్స్‌ పోర్ట్‌ పథకం
* మెట్రో లైట్‌, మెట్రో నియో పథకాలు
* వాహనరంగం వృద్ధికి చర్యలు.. ఇప్పటికే పలు నగరాల్లో మెట్రో సేవలు..
* వైద్యం, ప్రజారోగ్యానికి భారీ కేటాయింపులు
* హెల్త్ కేర్ కోసం రూ.2,23,846 కోట్లు
* పీఎం ఆత్మనిర్భర్ స్వస్థ్ యోజన పథకానికి రూ. 64,180 కోట్లు
* కరోనా వ్యాక్సిన్ కోసం 35,000 కోట్లు
* అర్బన్ స్వచ్ఛ్ భారత్ మిషన్ కోసం రూ.1,41,678 కోట్లు
* 15 ఏళ్లు దాటిన వాణిజ్య వాహనాలను తుక్కు కింద మార్చే పథకం. 
* వాయు కాలుష్యం నివారణకు రూ.2,217కోట్లు. 
* పట్టణాల్లో నీటి సమస్య పరిష్కారానికి జల్‌ జీవన్‌ అభియాన్
* మార్చి 22 కల్లా 8,500 కిలోమీటర్ల అదనపు హైవేల నిర్మాణం
* మెట్రో, బస్ స్టాప్‌ల నిర్మాణానికి రూ. 18 వేల కోట్లు
* రైల్వేశాఖ అభివృద్దికి రూ. 1.15 లక్షల కోట్లు
* మూడేళ్లలో ఏడు టెక్స్‌టైల్స్ పార్కుల అభివృద్ధి
* రక్షిత మంచినీటి పథకానికి రూ.87 వేల కోట్లు
* జలజీవన్ మిషన్‌కు రూ. 2.87 లక్షల కోట్లు
* వాయుకాలుష్యం నివారణకు రూ.2,217 కోట్లు
* హైడ్రోజన్‌ ఎనర్జీపై దృష్టి
* ఇండియన్‌ షిప్పింగ్‌ కంపెనీకి రూ.1624 కోట్లు
* నౌకల రీసైక్లింగ్‌ సామర్థ్యం పెంపు
* రానున్న మూడేళ్లలో మరిన్ని జిల్లాల్లో ఇంటింటికీ గ్యాస్‌ సరఫరా
* మరో కోటి మందికి ఉజ్వల కింద ఉచిత గ్యాస్ కనెక్షన్లు
* జాతీయ స్థాయిలో పెట్టుబడుల ఉపసంహరణ పర్యవేక్షణకు ప్రత్యేక డ్యాష్‌ బోర్డు

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు