#Budget2021 : ఐటీ రిటన్స్ దాఖలు నుంచి వయో వృద్ధులకు ఊరట

సోమవారం, 1 ఫిబ్రవరి 2021 (12:54 IST)
దేశంలోని వయో వృద్థులకు కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ ఓ శుభవార్త చెప్పారు. ఇకపై వయో వృద్ధులు ఐటీ రిటన్స్‌ దాఖలు చేయడం నుంచి మినహాయింపు కల్పిస్తున్నట్టు ఆమె ప్రకటించారు. పెన్షన్‌, పన్ను ఆదాయాలు మాత్రమే కలిగిన 75 సంవత్సరాలకు పైబడిన వృద్ధులకు ఐటీ రిటన్స్‌ దాఖలు చేయడం నుంచి మినహాయింపు వర్తిస్తుంది. 
 
ఇక చిన్న మొత్తాల్లో పన్ను చెల్లింపుదారులకు వివాద పరిష్కార కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. అందుబాటు ధరల్లో గృహనిర్మాణానికి పన్ను విరామాన్ని ప్రకటించారు. 
 
అలాగే, ల‌బ్ధిదారుల సౌక‌ర్యం కోస‌మే దేశంలో వ‌న్ నేష‌న్ వ‌న్ రేష‌న్ కార్డు స్కీమ్‌ను అమ‌ల్లోకి తెచ్చామ‌న్నారు. ఈ ప‌థ‌కం వ‌ల్ల ల‌బ్ధిదారుడు ఏ రాష్ట్రం, ఏ ప్రాంతానికి చెందిన వాడైనా మ‌రే ఇత‌ర ప్రాంతం లేదా రాష్ట్రం నుంచైనా స‌రుకులు తీసుకునే సౌక‌ర్యం క‌లిగింద‌ని ఆమె తెలిపారు. 
 
ముఖ్యంగా బ‌తుకుదెరువు కోసం ఇత‌ర ప్రాంతాల‌కు వెళ్లే వ‌ల‌స కార్మికుల‌కు ఈ ప‌థ‌కం ఎంతో ఉప‌యోగ‌ప‌డుతున్న‌ద‌ని నిర్మ‌లా సీతారామ‌న్ చెప్పుకొచ్చారు. ప్ర‌స్తుతం దేశంలోని 32 రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల్లో వ‌న్ నేష‌న్ వ‌న్ రేష‌న్ కార్డు స్కీమ్ అందుబాటులో ఉన్న‌ద‌ని ఆమె వెల్ల‌డించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు