అక్షయ తృతీయ 2024.. మేలో అత్యధికంగా పెరిగిన బంగారం ధరలు

సెల్వి

శుక్రవారం, 10 మే 2024 (15:51 IST)
అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం నగరంలో బంగారం ధరలు పెరిగాయి. దీంతో మేలో ఇప్పటివరకు అత్యధిక ధరలను నమోదు చేసింది. అక్షయ తృతీయ వంటి శుభ సందర్భాలలో బంగారాన్ని కొనుగోలు చేసే సంప్రదాయం భారతీయ సంస్కృతిలో వుంది. ఇది శ్రేయస్సు, అదృష్టాన్ని కలిగిస్తుందని నమ్ముతారు.
 
శుక్రవారం, 24 క్యారెట్ల బంగారం ధర 10 రోజుల గరిష్టానికి పెరిగింది, 10 గ్రాముల ధర రూ.73,090 వద్ద స్థిరపడింది. అదేవిధంగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.67,000కి చేరుకుంది. ఏప్రిల్ 23 నుండి ధరలు రూ. 73,000 కంటే తక్కువగా ఉన్న తర్వాత, అక్షయ తృతీయ రోజున ఒక్కసారిగా పెరిగాయి. 
 
బంగారం పెరుగుదలతో పాటు, వెండి ధర కూడా గణనీయమైన పెరుగుదలను చూసింది. శుక్రవారం 1 కిలో రూ. 90,000 వద్ద రిటైల్ చేయబడింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు