టైర్ల నిర్మాణ రంగంలో అగ్రగామిగానున్న ఫ్రెంచ్కు చెందిన మికెలిన్ సంస్థ ఉద్యోగ నియామకాలు చేపట్టనుంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చెన్నై నగరంలోని తమ సంస్థకు చెందిన టైర్ల కర్మాగారంలో రెండు వందల మందిని నియమించేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నట్లు సంస్థ అధ్యక్షుడు(ఆఫ్రికా, ఇండియా, మధ్య ఆసియా) ప్రశాంత్ ప్రభు బుధవారం వెల్లడించారు.
తమ సంస్థ తన కార్యకలాపాలను కొనసాగించేందుకు రూ. 4,000 కోట్లను పెట్టుబడులుగా పెట్టనుందని, ఈ పెట్టుబడులను దశలవారీగా ఏడు సంవత్సరాల కాలంలో ఉత్పత్తులను పెంచేందుకు కృషి చేస్తుందన్నారు. తాము కొత్తగా నియమించే వారిని శిక్షణ నిమిత్తం మూడు వారాలపాటు థాయ్లాండ్కు పంపేందుకు నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు.
ఇదిలావుండగా తమ సంస్థ చెన్నై కర్మాగారానికి సంబంధించి ఇప్పటికే అరవై మంది ఉద్యోగులను నియమించిందని ఆయన తెలిపారు.