గుండె జబ్బులు రాకుండా వెల్లుల్లి పాయసం తాగితే చాలు... ఎలా చేయాలో తెలుసా?

శుక్రవారం, 27 సెప్టెంబరు 2019 (20:24 IST)
ధమనుల్లో కొవ్వు పేరుకుపోయినప్పుడు రక్త ప్రసరణ మార్గం చిన్నదవుతుంది. ఈ సమస్యనే ఎథిరోస్క్లైరోసిస్ అంటారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే, ధమనులు ఇంకా కుంచించుకుపోయి గుండెకి, మెదడుకి, మూత్రపిండాలకు శరీరంలో సమస్త భాగాలకు జరిగే రక్తసరఫరాలో సమస్యలు వస్తాయి.

దీనివల్ల గుండెపోటు లేదా మెదడు రక్త కణాలు చిట్లిపోవడమో జరిగి ప్రాణాపాయం ఏర్పడుతుంది. సమస్య అంతదాకా వచ్చిన తర్వాత ఆసుపత్రులకు పరుగెత్తేకంటే సమస్య రాకుండా ముందుజాగ్రత్తలు తీసుకోవడం మంచిది. 
 
రోజూ ఒక వెల్లుల్లి రేకును నమిలి మింగితే చాలు. అలాగే వెల్లుల్లిని పాలలో ఉడికించి పాయసం (రసోనా క్షీరం) తయారుచేసుకుని తాగినా ప్రయోజనం వుంటుంది.
 
పాయసం తయారుచేసే పద్ధతి
ఐదు గ్రాముల వెల్లుల్లి రేకులు తీసుకుని దాని పైపొట్టును తొలగించి, వాటిని 50 మిల్లీలీటర్ల పాలల్లో 6 గంటలపాటు నానబెట్టాలి. ఆ తర్వాత వాటిని తీసి 200 మిల్లీలీటర్ల పాలలో వేసి సగానికి సగం తగ్గేదాకా మరిగించాలి. ఆపై వడబోసి నేరుగా కానీ, మధుమేహం లేనివారైతే చక్కెర కలిపి కానీ రోజూ రాత్రివేళ నిద్ర పోయే ముందు సేవిస్తే ధమనులు గట్టిపడి, గుండె సంబంధమైన సమస్యలు రావు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు