రైలుకు - ఫ్లాట్‌ఫామ్ ‌మధ్య పడిన యువతి.. మెరుపువేగంతో స్పందించిన కానిస్టేబుల్... (వీడియో)

ఠాగూర్

బుధవారం, 2 జులై 2025 (11:22 IST)
ఫ్లాట్ ఫామ్ నుంచి కదిలిన రైలు ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ యువతి.. పట్టుకోల్పోయి రైలుకు, ఫ్లాట్ ఫామ్‌ మధ్యలో పడిపోయింది. ఆ యువతిని ఓ కానిస్టేబుల్ మెరుపు వేగంతో స్పందించి రక్షించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్ రైల్వే స్టేషన్ వద్ద జరిగింది. ఈ స్టేషనులో కదులుతున్న రైలులోకి ఓ యువతి పరుగెత్తుకుంటూ వచ్చి ఎక్కేందుకు ప్రయత్నించింది. అయితే, ఆ యువతి బోగీలోకి ఎక్కే సమయంలో కాలు జారడంతో పట్టుకోల్పోయి, కిందపడిపోయింది. 
 
దీంతో ఆ యువతిని పోలీస్ కానిస్టేబుల్ మెరుపు వేగంతో స్పందించి రక్షించడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. ఆ  కానిస్టేబుల్‌ను ఇతర రైల్వే ప్రయాణికులతో పాటు వీడియోను చూసిన నెటిజన్లు ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. 

 

ప్రాణాలు కాపాడిన పోలీస్

కదులుతున్న రైళ్లలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించొద్దని అధికారులు ఎన్నిసార్లు చెప్పినా ప్రజల్లో మార్పు రావట్లేదు. తాజాగా నాగ్పూర్ రైల్వే స్టేషన్లో కదులుతున్న రైలులోకి ఓ యువతి పరిగెత్తుకుంటూ ఎక్కేందుకు యత్నించింది. కాలు జారడంతో రైలు-ప్లాట్ఫామ్ మధ్య… pic.twitter.com/sPSzJgGmII

— ChotaNews App (@ChotaNewsApp) July 2, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు