ముందుగా గోంగూర ఆకును బాగా కడిగి ఉడికించి పెట్టుకోవాలి. పాన్లో నెయ్యి లేదా నూనెను శుభ్రం చేసిన రొయ్యల్ని వేసి బాగా వేయించాలి. ఈ వేయించిన రొయ్యలను నెయ్యి లేకుండా విడిగా తీసిపెట్టుకోవాలి. ఈ మిగిలిన నెయ్యిలో ఎండుమిర్చి, తాలింపుదినుసులు ఉల్లిపాయముక్కలు, కరివేపాకు పచ్చిమిర్చి వేసి వేయించాలి.
అవి దోరగా వేగాక అల్లం వెల్లుల్లి మిశ్రమం ఆ తర్వాత టమాటా ముక్కలు చేర్చాలి. అనంతరం ముందుగా ఉడికించి పెట్టుకున్న గోంగూర, కాస్త పసుపు, ఉప్పు, కారం వేసి మూతపెట్టాలి. కొద్దిసేపు కుతకుత ఉడికిన తర్వాత ధనియాలపొడి, వేయించిన రొయ్యల్ని చేర్చాలి. 5 లేదా 6 నిమిషాలు అయ్యాక కొత్తిమీర చల్లి దింపేస్తే గుమగమలాడే రుచికరమైన గంగూర మీకు సిద్దం.