సర్పదోషాలు తొలగిపోవడానికి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే..?

శనివారం, 8 సెప్టెంబరు 2018 (11:19 IST)
అనేక ప్రాంతాలలో ప్రధాన దైవంగాను, ఉపాలయాలలోనూ సుబ్రహ్మణ్య స్వామిగా దర్శనమిస్తుంటారు. భక్తులచే పూజలు అందుకుంటూ కోరికలను నెరవేరుస్తుంటాడు. అందువలనే ఆ స్వామిని భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ ఆ స్వామి అనుగ్రహాన్ని పొందుతుంటారు. అనంతపురం జిల్లా పరిధిలోని పంపనూరులో స్వామివారిని ఎక్కువగా పూజిస్తుంటారు.
 
ఇక్కడి స్వామివారు పాము రూపంలో కొలువై ఉంటారు కనుక పూర్వం ఈ ప్రాంతాన్ని ఫణిపూరుగా పిలుస్తుంటారు. కాలక్రమంలో ఈ ఊరు పంపనూరుగా మారిందని చెప్తుతున్నారు. ఈ స్వామివారిని దర్శించుకోవడం వలన రాహు, కేతు, కుజ, సర్పదోషాలు తొలగిపోతాయి. స్వామివారిని అంకితభావంతో పూజించడం వలన ఆపదలు, అనారోగ్యాలు దరిచేరని పురాణాలు చెబుతున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు