అంకితభావంతో ఆదిదేవుడిని పూజించాలేగాని అడిగిన వరాలను ఆయన ఆలస్యం చేయకుండా అనుగ్రహిస్తుంటాడు. ఈ కారణంగానే దేవతల నుంచి సాధారణ మానవుల వరకూ అనునిత్యం ఆయనని దర్శిస్తూ వుంటారు ... పూజాభిషేకాలతో సేవిస్తూ వుంటారు. ఈ నేపథ్యంలో పరమశివుడి మనసు మరింతగా గెలుచుకునే రోజుగా 'మహాశివరాత్రి' కనిపిస్తూ వుంటుంది.