బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. ఎల్లో అలెర్ట్

శనివారం, 30 సెప్టెంబరు 2023 (09:18 IST)
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణలో భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. దీని ప్రభావంతో తెలంగాణలో నేటి నుంచి నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. ఈ మేరకు హైఅలర్ట్ ప్రకటించారు. 
 
కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అక్టోబర్ 3 వరకు భారీ వర్షాలు కురుస్తాయని దీంతో ఎల్లో అలర్ట్‌ను ప్రకటించినట్లు అధికారులు తెలిపారు. 
 
ఏపీలోనూ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. వచ్చే రెండు రోజుల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు