హోమ్ వర్క్ చేయలేదని విద్యార్థిని చితక్కొట్టిన టీచర్.. ఎక్కడ? (video)

సెల్వి

శుక్రవారం, 18 అక్టోబరు 2024 (14:33 IST)
Teacher
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గొల్లగూడెంలోని మానస వికాస్ పాఠశాలలో హోమ్ వర్క్ చేయలేదని ఓ ఉపాధ్యాయుడు విద్యార్థి పట్ల దారుణంగా ప్రవర్తించాడు. ఈనెల 16న ఆరో తరగతి విద్యార్థులకు ఉపాధ్యాయుడు సతీశ్ హోమ్ వర్క్ ఇచ్చారు. 
 
అయితే ఓ విద్యార్థి మాత్రం హోమ్ వర్క్ చేయలేదు. అదే విషయాన్ని బాలుడు ఉపాధ్యాయుడికి చెప్పాడు. దీంతో కోపోద్రిక్తుడైన టీచర్ తాను చెప్పిన పని ఎందుకు చేయలేదంటూ చిన్నారిని బెత్తంతో తీవ్రంగా కొట్టాడు. అది చాలదన్నట్లు చేతులతో పిడిగుద్దులు కురిపించాడు. 
 
కసి తీసే వరకూ తీవ్రంగా కొట్టాడు. దీంతో కోపోద్రిక్తుడైన టీచర్ తాను చెప్పిన పని ఎందుకు చేయలేదంటూ చిన్నారిని బెత్తంతో తీవ్రంగా కొట్టాడు. అది చాలదన్నట్లు చేతులతో పిడిగుద్దులు కురిపించాడు. కసి తీసే వరకూ తీవ్రంగా కొట్టాడు. 
 
దీనికి సంబంధించిన దృశ్యాలు తరగతి గదిలోని సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డు అయ్యాయి. అయితే బాలుడి తల్లి అతనికి స్నానం చేయించేందుకు బట్టలు తీసింది. ఒంటి నిండా గాయాలు ఉండడంతో ఆమె ఒక్కసారిగా కన్నీటి పర్యంతం అయ్యింది. ఈ విషయాన్ని వెంటనే భర్తకు చెప్పింది. 
 
ఇద్దరూ కలిసి కుమారుడిని ప్రశ్నించగా.. ఉపాధ్యాయుడు దాడి చేయడం గురించి వివరించాడు. ఆపై సీసీటీవీ రికార్డులతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై జిల్లా విద్యాశాఖ అధికారి విచారణ జరిపి ఉపాధ్యాయుడిని వెంటనే సస్పెండ్ చేయాలని విద్యార్థి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

హోమ్ వర్క్ చేయలేదని పిల్లాడిని చావబాదిన టీచర్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలో ఓ ప్రైవేట్ స్కూల్లో సతీశ్ అనే టీచర్ హోం వర్క్ చేయలేదని ఆరో తరగతి విద్యార్థిని చావబాదాడు.

తమ బిడ్డ ఒంటిపై దెబ్బలు చూసిన తల్లిదండ్రులు సీసీ ఫుటేజీ ఆధారంగా టీచర్‌పై పోలీసులకు… pic.twitter.com/2Gr5DCFfox

— Telugu Scribe (@TeluguScribe) October 17, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు