గంటల కొద్దీ మొబైల్‌ బ్రౌజ్‌.. 15 ఏళ్ల బాలిక ఆత్మహత్య.. సీలింగ్‌ ఫ్యాన్‌కు?

సెల్వి

బుధవారం, 29 మే 2024 (17:51 IST)
విశాఖపట్నంలో బుధవారం 15 ఏళ్ల బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. గంటల కొద్దీ మొబైల్‌ బ్రౌజ్‌ చేస్తూ బాలికను ఆమె తల్లి అన్నపూర్ణ మందలించడంతో మధురవాడలోని వాంబే కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
భర్త మహేశ్ మృతి చెందడంతో బాలికకు అన్నపూర్ణ సింగిల్ పేరెంట్ అని తెలిసింది. బాలిక తన నివాసంలో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఉండటాన్ని గమనించి వెంటనే చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. 
 
అనంతరం బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కింగ్‌ జార్జ్‌ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు