ఆంధ్ర ప్రదేశ్ రైతులకు మరింత షార్ట్ కట్ ద్వారా సేవలను అందించాలనీ, వారు పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు పడిగాపులు కాయాల్సిన పని లేకుండా కూటమి ప్రభుత్వం చేస్తోందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఈరోజు సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 300 సేవలకు పైగా వాట్సప్ ద్వారా అందిస్తోందనీ, వాటిని రైతులు చక్కగా వినియోగించుకుంటున్నారని కితాబు ఇచ్చారు.