జగన్ ఫోటో ఉన్నా సరే విద్యా కిట్లు పంపిణీ చేయండి : సీఎం చంద్రబాబు ఆదేశం

వరుణ్

గురువారం, 13 జూన్ 2024 (14:28 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీయే కూటమి కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత ఆయన పవిత్ర తిరుమల పుణ్యక్షేత్రానికి వెళ్లి తన ఇష్టదైవమైన శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నారు. అక్కడ నుంచి రాష్ట్ర ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. తిరుమల పవిత్రను, పరిశుభ్రతను కాపాడేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే, ప్రజాధనం వృధా చేయరాదన్ని సంకల్పంతో కొత్త విద్యా సంవత్సరంలో విద్యార్థులకు పంపిణీ చేసే విద్యా కిట్లపై మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉన్నప్పటికీ పంపిణీ చేయాలని ఆదేశించారు.
 
కాగా, ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తమ ప్రభుత్వ పాలనలో ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యలు, పగ ఉండవని ప్రకటించి, ఆ మాటలను చేతల్లో నిరూపించారు. రాష్ట్రంలో స్కూల్స్ పునఃప్రారంభమైన నేపథ్యంలో జగన్ ఫోటో ఉన్నప్పటికీ విద్యార్థులకు ఆ కిట్‌లను పంపిణీ చేయాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజాధనం దుర్వినియోగం చేయద్దంటూ చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సీఎం హోదాలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని టీడీపీ స్వాగతిస్తూ, ఆసక్తికర ట్వీట్ చేసింది. 
 
"బాబు గారికి పేరొస్తుందని అన్న క్యాంటీన్లను రద్దు చేసి పేదల కడుపుకొట్టిన గత ముఖ్యమంత్రికి, చంద్రబాబు గారికి ఎంత తేడా? ప్రజాధనం వృధా కాకూడదు. పాలనలో పగ ప్రతీకారాలకు చోటు ఉండకూడదంటూ... జగన్ బొమ్మ ఉన్న స్కూల్  పిల్లల కిట్స్‌ను అలాగే పంపిణీ చేయమని ఆదేశించిన సీఎం చంద్రబాబు గారు" అంటూ టీడీపీ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో ఓ పోస్టరుతో ట్వీట్ చేసింది. 

 

బాబు గారికి పేరొస్తుందని అన్న క్యాంటీన్లను రద్దు చేసి పేదల కడుపుకొట్టిన గత ముఖ్యమంత్రికి, చంద్రబాబు గారికి ఎంత తేడా? ప్రజాధనం వృధా కాకూడదు. పాలనలో పగ ప్రతీకారాలకు చోటు ఉండకూడదంటూ... జగన్ బొమ్మ ఉన్న స్కూల్ పిల్లల కిట్స్ ను అలాగే పంపిణీ చేయమని ఆదేశించిన సీఎం చంద్రబాబు గారు.#TDPpic.twitter.com/Q76iAcrbYN

— Telugu Desam Party (@JaiTDP) June 12, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు