విలువలతో కూడిన సమాజానికి పునాదులు వేయాలి : మంత్రి బొత్స

బుధవారం, 4 సెప్టెంబరు 2019 (14:48 IST)
విలువలతో కూడిన సమాజానికి ఉపాధ్యాయులు పునాదులు వేయాలని ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని ఉపాధ్యయులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో ఉపాధ్యాయవర్గానికి ఆది నుంచీ పెద్దపీట ఉందని, భావితరాన్ని తీర్చిదిద్దే ప్రక్రియలో వీరందరూ గురుతర బాధ్యతలు నిర్వహిస్తున్నారని ఉపాధ్యాయుల సేవలను కొనియాడారు. 
 
ఉత్తమమైన వ్యక్తులుగా విద్యార్ధులను మలిచే ఉపాధ్యాయులందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియచేశారు. విలువలతో కూడిన సమాజమే లక్ష్యంగా, ప్రస్తతమున్న పరిస్థితుల్లో మార్పులు రావాలన్న గౌరవనీయ ముఖ్యమంత్రి వైయస్.జగన్ మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ఉపాధ్యాయులందరూ తమ విధులను నిర్వహించాలన్నారు. 
 
 
విద్యార్ధుల్లో ఉన్నత విలువలు పెంపొందిస్తూ, వారి భవిష్యత్తుకు మంచి పునాదులు వేసేలా పురపాలక శాఖ పాఠశాలల్లోనూ, ఇతర విద్యా సంస్థల్లోనూ విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులందరూ కృషి చేయాలని ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ ఆకాంక్షించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు