ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం సమర్ధమంతమైన ప్రజాపాలనను అందించేందుకు చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా, ప్రజా రవాణాకు అనువుగా, ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు వీలుగా కొత్తగా ఆర్టీసీ బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించింది.
ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా కొత్త బస్సులను కొనుగోలు చేయడంతో పాటు దీర్ఘకాలిక ప్రణాళికలను అమలు చేస్తున్నామని తెలిపారు. ఆయన పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోను సందర్శించి, అక్కడి పరిస్థితులను సమీక్షించారు.
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఉమ్మడి విజయనగరం జిల్లాకు 98 కొత్త బస్సులు రానున్నాయని, దీనివల్ల ప్రయాణికుల ఇబ్బందులు చాలావరకు తగ్గుతాయని అన్నారు. 'స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నాం. కొత్త బస్సులు అందుబాటులోకి వస్తే మహిళల ఉచిత ప్రయాణానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు' అని ఆయన స్పష్టం చేశారు.
అలాగే 2028 నాటికి రాష్ట్రంలోని అన్ని డిపోలకు దశలవారీగా ఎలక్ట్రిక్ బస్సులను తీసుకువస్తామని, పాత బస్సులను ఆధునిక హంగులతో మెరుగుపరుస్తున్నామని వివరించారు. ఆర్టీసీలో డ్రైవర్లు, కండక్టర్ల కొరత ఉన్న మాట వాస్తవమేనని ఈడీ అంగీకరించారు. పార్వతీపురం జిల్లాకు అదనపు బస్సులు కావాలని కోరుతూ ఇప్పటికే ప్రభుత్వానికి లేఖ రాశామని ఆయన పేర్కొన్నారు.