45 ఏళ్లు నిండినవారంతా టీకా వేయించుకోండి: విజయవాడలో 25 కేంద్రాలలో...

మంగళవారం, 6 ఏప్రియల్ 2021 (21:46 IST)
విజయవాడ: రాష్ట్రంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా ప్రజల సౌకర్యార్దం నగర పరిధిలోని 28 వార్డ్ సచివాలయాలలో విస్తృత స్థాయిలో 45 సంవత్సరాల వయస్సు పైబడిన వారందరికి కోవిడ్ వ్యాక్సినేషన్ వేయు కార్యక్రమమునకు నగరపాలక సంస్థ తగిన ఏర్పాట్లు చేసినట్లు ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని  నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ పిలుపునిచ్చారు.
 
నగర ప్రజానీకం తప్పనిసరిగా కోవిడ్ నిబందనల పాటిస్తూ కోవిడ్ బారిన పడకుండా తగిన జాగ్రత్త వహించాలని సూచిస్తూ, ప్రజల సౌకర్యార్దం ది. 07-04-2021 బుధవారం ఉదయం 09-00 నుండి సాయంత్రం గం.05-00 గంటల వరకు ఈ దిగువ తెలిపిన వార్డ్ సచివాలయాలలో కోవిడ్ వ్యాక్సినేషన్ నిర్వహింపబడునని పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు