ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం

బుధవారం, 13 మే 2020 (20:23 IST)
ఆగ్నేయ బంగాళాఖాతం మరియు దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనం 48 గంటల్లో బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది.

ఐఎండి సూచనల ప్రకారం కోస్తాంధ్ర, రాయలసీమలో పలుచోట్ల పిడుగులతో  కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. మత్స్యకారులు ఎవరు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని విపత్తుల శాఖ కమిషనర్ కె. కన్నబాబు సూచించారు.

రాగల 48 గంటలు రాయలసీమలో పలుచోట్ల 40°C -43°C అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం వడగాలుల బారిన పడకుండా మహిళలు, పిల్లలు, వృద్దులు సరైన జాగ్రత్తలు  తీసుకోవాలని కోరారు.
 
మిమ్మల్ని మీరు హైడ్రేట్ కాకుండా ఉండటానికి ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్, ఇంట్లో తయారుచేసిన పానీయాలైన లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు మొదలైనవి త్రాగాలి. మంచినీరు ఎక్కువగా తీసుకోవాలి.
 
రెండు రోజులపాటు  పిడుగులు పడే అవకాశం ఉన్నందున ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడేప్పుడు ముందుగానే రైతులు,కూలీలు, పశు, గొర్రెల కాపరులు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి. పిడుగుల పట్ల అశ్రద్ధవహించ రాదని విపత్తుల శాఖ కమిషనర్ సూచించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు