రాజకీయాలను తప్పుకున్న ఎంవీ మైసూరా రెడ్డి

సోమవారం, 18 మార్చి 2019 (09:35 IST)
ఉమ్మడి ఆధ్రప్రదేశ్ మాజీ హోం మంత్రి, రాయలసీమ ప్రాంతానికి చెందిన ఎంవీ మైసూరా రెడ్డి క్రియాశీలక రాజకీయాలకు తప్పుకున్నారు. ఈయన కాంగ్రెస్ పార్టీ నేతగా ఉండి, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. పిమ్మట వైకాపా తీర్థం పుచ్చుకుని, అక్కడ నుంచి బయటకు వచ్చేశారు.
 
ఈ నేపథ్యంలో క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ఆయన ప్రకటించారు. రాయలసీమ హక్కుల సాధనపై కడపలో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న మైసూరారెడ్డి మాట్లాడుతూ, రాయలసీమ అభివృద్ధి కోసం పాటుపడతానని, అవసరమైతే అన్ని పార్టీలనూ కలుపుకుని పోరాడతానని చెప్పారు. 
 
రాయలసీమ హక్కుల సాధన నిమిత్తం మహాసభ నిర్వహించాలని నిర్ణయించామని అన్నారు. రాయలసీమ సమస్యల పరిష్కారానికి మాజీ సీఎస్ అజయ్ కల్లం నేతృత్వంలో ఓ కమిటీ  ఏర్పాటు చేయనున్నట్టు మైసూరా రెడ్డి ప్రకటించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు