కేఎల్ సీసీ కన్వెన్షన్ సెంటర్ లో కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అమిత్ షా నాదెండ్ల భాస్కరరావును సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ కండువాకప్పారు.
ఇకపోతే ఏపీలో బీజేపీ బలోపేతం కావాలనే వ్యూహంతో అడుగులు వేస్తోంది. బలమైన నాయకులను పార్టీలో చేర్చుకునేందుకు కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ తండ్రి, మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావుకు గాలం వేసింది.