ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గత రెండు రోజులుగా వైరల్ జ్వరంతో బాధపడుతున్నారు. అయినా తన అధికారిక విధులను నిర్వర్తిస్తున్నారు. అనారోగ్యంతో ఉన్నప్పటికీ, కళ్యాణ్ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. సోమవారం జరిగిన కీలకమైన సమీక్ష సమావేశాలలో పాల్గొన్నారు.
ఈ నేపథ్యంలో ఆయన శీఘ్రంగా కోలుకోవాలని జనసైనికులు, పవన్ మద్దతుదారులు, పార్టీ కార్యకర్తలు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.