శ్రీవారికి కానుకల వెల్లువ.. పోస్కో నుంచి రూ.9కోట్ల విరాళం

శుక్రవారం, 26 ఫిబ్రవరి 2021 (11:42 IST)
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారికి కానుకలు వెల్లువెత్తుతున్నాయి. నిన్నటికి నిన్న స్వామికి శంఖుచక్రాలు కానుకగా ఓ తమిళ భక్తులు అందజేశాడు. ప్రస్తుతం పోస్కో సంస్థ శ్రీవారికి భారీగా విరాళం ఇచ్చింది.
 
శ్రీవారి ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.9 కోట్ల విరాళం ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం ఉదయం టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డికి పోస్కో సంస్థ సీఈవో సంజయ్‌ పాసి విరాళానికి సంబంధించిన డీడీలను అందజేశారు. 
 
శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దాతలకు పండితులు వేదాశీర్వచనంచేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. మరోవైపు తిరమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య కూడా రోజు రోజుకీ పెరిగిపోతోంది. అలాగే హుండీ ఆదాయం కూడా కోవిడ్‌కు ముందులా కోట్లలో వుందని టీటీడీ వెల్లడించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు