సినీ నిర్మాత బన్నీ వాసుకు జనసేన పార్టీలో కీలక పదవి లభించింది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీచేశారు. జనసేన పార్టీ ఆవిర్భావ మహానాడు మార్చి నెల 14వ తేదీన జరుగనుంది. ఈ మేరకు ముహూర్తాన్ని ఖరారు కూడా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి ఆవిర్భావ మహానాడు కావడంతో ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించాలని జనసేన పార్టీ నిర్ణయించింది.
సినిమా నిర్మాణంలో బన్నీ వాసు నైపుణ్యాన్ని, సంస్థాగత నైపుణ్యాన్ని జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్వస వేడుక విజయవంతానికి ఉపయోంచనున్నారని జనసైనికులు భావిస్తున్నారు. ఈ కీలక నియామకంలో జనికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.