నపుంశక భర్తకు సరైన శిక్షే పడిందా?

సోమవారం, 4 డిశెంబరు 2017 (19:58 IST)
భార్య శైలజను చిత్రహింసలకు గురిచేసి నరకయాతన చూపించిన చిత్తూరు జిల్లా జి.డి. నెల్లూరుకు చెందిన రాజేష్‌‌ను ఉపాధ్యాయ ఉద్యోగం నుంచి తొలగిస్తూ విద్యాశాఖ ఆదేశాలిచ్చింది. వి.కోట మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో రాజేష్‌ సంస్కృత టీచర్‌గా పనిచేస్తున్నాడు. పెళ్ళయిన మొదటిరోజే భార్యను అతి కిరాతకంగా హింసించి ఆమెను గాయపరిచిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
శోభనం రోజు తాను నపుంశకుడని బంధువులు చెప్పినందుకు శైలజపై దాడికి దిగాడు రాజేష్‌. ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంది. బాధితురాలికి అండగా ఉంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే మహిళా సంఘాలు రాజేష్‌‌ను ఉరితీయాలంటూ డిమాండ్ చేస్తున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు