ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి ధర్నా.. ఇదో రాజకీయ డ్రామా.. టీడీపీ

సెల్వి

మంగళవారం, 23 జులై 2024 (11:35 IST)
ఢిల్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ధర్నాపై తెలుగుదేశం పార్టీ స్పందించింది. టీడీపీ సీనియర్ లోక్‌సభ ఎంపీ దగ్గుమళ్ల ప్రసాద రావు మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధి కోసం దేశ రాజధానిలో గతంలో ఎన్నడూ ధర్నా చేయలేదన్నారు. జగన్ ఢిల్లీ పర్యటనలు ఎల్లప్పుడూ ఆయన చట్టపరమైన కేసుల గురించి ఉంటాయి. ఆంధ్రుల సమస్యలపై ఆయన ఎప్పుడూ ధర్నా చేయలేదని గుర్తు చేశారు.

ఆంధ్రా ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఇదో డ్రామా అని దగ్గుమళ్ల ఆరోపించారు. టీడీపీని నెగిటివ్‌గా చిత్రీకరించేందుకే జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని దగ్గుమళ్ల ప్రసాదరావు ఫైర్ అయ్యారు. తన పార్టీ ఎప్పుడూ రాష్ట్రాభివృద్ధిపైనే దృష్టి పెడుతుంది. లేనిపోని సమస్యలకు తమపై నిందలు మోపేందుకు జగన్ ప్రయత్నిస్తున్నట్లు ఆయన అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు