జోగి రమేష్ ఓ జోకర్... చంద్రబాబు జోలికొస్తే... గుడ్డలూడదీసి తంతాం : బుద్ధా వెంకన్న

ఠాగూర్

గురువారం, 4 ఏప్రియల్ 2024 (09:10 IST)
వైకాపా ఎమ్మెల్యే జోగి రమేష్‌కు టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న గట్టి వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబు ఇంటికి వస్తే గుడ్డలూడదీసి కొడతాం అంటూ హెచ్చరించారు. పైగా జోగి రమేష్ ఓ జోకర్, బఫూన్ అంటూ వ్యాఖ్యానించారు. వడదెబ్బ తగిలి కృష్ణా జిల్లా గోపాలలో ఓ వృద్ధురాలు చనిపోయింది. పింఛన్ అందకే ఆ వృద్ధురాలు చనిపోయిందంటూ వైకాపా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ, ఆ వృద్ధురాలి శవంతో టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటి వద్ద ధర్నాకు జోగి రమేష్ పిలుపునిచ్చారు. దీంతో టీడీపీ శ్రేణులు అప్రమత్తమయ్యాయి. మంగళగిరికి చెందిన పలువురు నాయకులతో పాటు విజయవాడకు చెందిన బుద్ధా వెంకన్న, దేవినేని ఉమ, తదితరులు చంద్రబాబు నివాసం వద్దకు చేరుకున్నారు. 
 
ఈ సందర్భంగా బుద్ధా వెంకన్న మాట్లాడుతూ, జోగి రమేష్ ఓ జోకర్... ఓసారి చంద్రబాబు వద్దకు వచ్చి హడావుడి చేసినందుకే మంత్రి పదవి వచ్చింది. అప్పట్లో పోలీసుల అండతో జోగి రమేష్ రెచ్చిపోయారు. అయినా టీడీపీ శ్రేణులు గట్టిగా ప్రతిఘటించాం. ఇపుడు మళ్లీ ఓట్ల కోసం చంద్రబాబు ఇంటికి వెళ్లాను. ధర్నా చేస్తానంటూ ప్రగల్భాలు పలుకుతున్నాడు. ఈసారి వస్తే జోగి రమేష్ గుడ్డలూడదీసి తంతాం" అంటూ ఆయన హెచ్చరించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు