సీఎం జగన్ చేష్టలు చెల్లికి మళ్లీ పెళ్లి అన్నచందంగా ఉన్నాయ్.. టీడీపీ నేత గద్దె

గురువారం, 1 ఏప్రియల్ 2021 (15:03 IST)
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, విజయవాడలోని కృష్ణలంకలో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి చేసిన శంఖు స్థాపన ప్రక్రియ ఆసాంతం ఒక ప్రహసనాన్ని తలపించిందని, 2014కు ముందు ప్రజలకోరికను మన్నించి, ఆనాడు టీడీపీ ప్రజలపక్షాన రిటైనింగ్ వాల్ నిర్మాణం కోసం పోరాడిందని, ప్రతినెలా వివిధరకాల నిరసన కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు తెలిపారు. 
 
గురువారం ఆయన తననివాసం నుంచి జూమ్ యాప్ ద్వారా విలేకరులతో మాట్లాడారు. విజయవాడ నగర సమగ్రాభివృద్ధి కోసం టీడీపీ పనిచేసిం దని, బుద్దా వెంకన్న నాయకత్వంలో ఫ్లైఓవర్ నిర్మాణం కోసం, బొండా ఉమామహేశ్వరరావు నాయకత్వంలో బుడమేరు డైవర్షన్ నిర్మాణం కోసం నాడు టీడీపీ పోరా డిందన్నారు. టీడీపీ 2014లో అధికారంలోకి వచ్చాక, చంద్రబాబు తొలిసారి విజయవాడకు వచ్చారని, కరకట్ట నిర్మాణాన్ని త్వరలో ప్రారంభిస్తామని చెప్పడం జరిగిందన్నారు. 
 
2015లో టెండర్లప్రక్రియ పూర్త య్యాక పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. ఎంతటి వరదలు వచ్చినా తట్టుకునేలా కరకట్ట (రిటైనింగ్ వాల్ ) నిర్మాణం చేయాలని టీడీపీ ప్రభుత్వం భావించిందన్నా రు. భూమిపైన ఎంతఎత్తుఉంటుందో, అంతేఎత్తు భూమి లోపలకూడా ఉండేలా, పిల్లర్లను భూమిలోపలికివేసి నిర్మాణంచేయాలనుకున్నట్లు రామ్మోహన్ రావు చెప్పా రు.
 
మంత్రిగా ఉన్నదేవినేని ఉమామ హేశ్వరరావు కూడా కరకట్ట నిర్మాణానికి తగినచొరవతీసుకొని నిధలు విడుదల చేయించారని, 14-06-2015న శంఖు స్థాపనచేయడం కూడా జరిగిందన్నారు. కరకట్ట నిర్మాణంపై అధికారులు అనేకసమాలోచనలు, సంప్రదింపు జరిపారని, శాశ్వతంగా వరదముంపు సమస్యపరిష్కారమయ్యేలా నిర్మాణం చేయాలని భావించారన్నారు. 2018లో కరకట్ట నిర్మాణంలో తొలిదశపూర్తయిందన్నారు. 
 
నిర్మాణానికి అవసరమైన నిధులను మూడు దశల్లో ఇవ్వాలని నాటిప్రభుత్వం నిర్ణయించిందని, తొలిదశకు రూ.165కోట్లు, రెండోదశ నిర్మాణానికి రూ.145కోట్లు, మూడోదశలో మిగిలింది చెల్లించేలా నాడు తీర్మానం చేయడంజరిగిందన్నారు. 
తరువాత వైసీపీ అధికారంలోకి వచ్చిందని, కరకట్ట నిర్మాణంలో ఈ ప్రభుత్వం రెండేళ్లు కాలయాపన చేసిందన్నారు. అధికారంలోకి రాగానే పనులుప్రారంభించి ఉంటే, దాదాపు 5 కిలోమీటర్లవరకు రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తైఉండేదన్నారు. 
 
టీడీపీప్రభుత్వంలో శంఖుస్థాపన జరుపుకొని, కొంతనిర్మాణంపూర్తైన రిటైనింగ్ వాల్‌కు, తిరిగి  శంఖుస్థాపన చేయడంద్వారా ఈ ముఖ్యమంత్రి అంతాతామే చేశామని ప్రజలను నమ్మించే పనిలో ఉన్నాడని రామ్మోహన్ రావు మండిపడ్డారు. జగన్ అధికారంలోకి రాగానే రిటైనింగ్ వాల్ నిర్మాణంపై దృష్టిపెట్టిఉంటే, ఈ రెండేళ్లలో వచ్చిన వరదలకు విజయవాడలోని లోతట్టుప్రాంతాలవారికి కష్టాలులేకుండా ఉండేవన్నారు. 
 
రిటైనింగ్ వాల్ నిర్మాణం 30 సంవత్సరాల కలని ముఖ్యమంత్రి చెప్పడం హాస్యాస్పదమన్నారు. టీడీపీ ప్రభుత్వంలో నిర్మించిన కర్నూలు ఓర్వకల్లు విమానాశ్రయాన్ని తిరిగిప్రారంభించి, తానే నిర్మించినట్లు ముఖ్యమంత్రి పోజులివ్వడం దురదృష్టకరమన్నారు. రిటైనింగ్ వాల్ నిర్మాణంలో తొలిదశను తెలుగుదేశం ప్రభుత్వమే పూర్తిచేసిందని, ముఖ్యమంత్రి ఇప్పుడు రెం డోదశ నిర్మాణానికి శంఖుస్థాపనచేశారన్నారు. 
 
ఆనాడు టీడీపీ ప్రభుత్వం రిటైనింగ్ వాల్ పక్కన 70 అడుగుల వెడల్పురోడ్డుఉండేలా ప్రణాళికలువేసిందన్నారు. టీడీపీ హాయాంలో నిర్మితమైన వాల్ కోసం ఎక్కడా ఒక్కఇల్లు కూడా  తొలగించలేదని, వాల్‌కు, ఇప్పుడున్న కాలనీకి మధ్యన 70 అడుగుల వెడల్పుస్థలముంటే, దానిలో రోడ్డువేయాలని నిర్ణయించడమైందన్నారు. తొలిదశ నిర్మాణంలో ఒక్క ఇల్లు కూడాపోకుండా టీడీపీ ప్రభుత్వం వాల్‌ను నిర్మిస్తే, రెండోదశ నిర్మాణంకోసం వైసీపీ ప్ర భుత్వం మూడొంతల ఇళ్లను తొలగించడానికి సిద్ధమైందని టీడీపీ ఎమ్మెల్యే ఆక్షేపించారు. 
 
మూడొంతుల ఇళ్లను తీసే శాక, వాల్‌ను నిర్మించినా ఎవరికి ఉపయోగం ఉంటుందో ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి సమాధానంచెప్పాలన్నారు. చెల్లికి మళ్లీ మళ్లీ పెళ్లి అన్నట్లుగా చేసిన శంఖుస్థాపనలే మళ్లీ మళ్లీ చేస్తున్నముఖ్యమంత్రికి రిటైనింగ్ వాల్ నిర్మా ణం యొక్కఅసలు ఉద్దేశం తెలియకపోవడం బాధాకర మన్నారు. నిర్మాణం యొక్క గొప్పతనం, ఉద్దేశం తెలు సుకోకుండా, కనీసం 40అడుగులవెడల్పు రోడ్డైనా లే కుండా నిర్మాణంచేసినా దానివల్ల ఉపయోగంఉండదని రామ్మోహన్ రావు తేల్చిచెప్పారు. రెండోదశ నిర్మాణానికి ప్రభుత్వంఎక్కడైతే మార్కింగ్ చేసిందో, మూడొంతుల ఇళ్లకు మార్కింగ్ఇచ్చారని, కేవలం ఒక వంతుఇళ్లకోసం నిర్మాణం చేయడం ఎంతవరకు సమంజ సమో ప్రభుత్వం ఆలోచించాలన్నారు. 
 
శంఖుస్థాపనలపేరుతో అందమైన రాళ్లేయడంకాకుండా, చేసేనిర్మాణం పేదలకు ఉపయోగ పడేలా ఉండేలా చూడాలని టీడీపీ తరుపున కోరుతు న్నామన్నారు. దాదాపు 40వేలకుటుంబాలకు రక్షణగా ఉండే రిటైనింగ్ వాల్ నిర్మాణంలో అలసత్వం, అవినీతి, అశ్రధ్ద ఉండటం మంచిదికాదని టీడీపీఎమ్మెల్యే హితవు పలికారు. గతప్రభుత్వమే రిటైనింగ్ వాల్ నిర్మాణానికి చేయాల్సిందంతా చేసిందని, ఎంతటివరద వచ్చినా తట్టుకునేలా నిర్మాణాన్నిప్రారంభించి ఒకదశను పూర్తి చేసిందన్నారు.
 
వాల్‌కు సపోర్టుగా పొరపాట్లకు తావులేకుండా కాంక్రీట్ సిమెంట్ రోడ్డుని వాల్‌కు మద్ధతుగా ఏర్పుటుచే యాలన్నారు. శంఖుస్థాపన చేశాం పనైపోయిందన్నట్టు కాకుండా, భవిష్యత్‌లో అందరూ చెప్పుకునేలా వాల్ నిర్మాణం చేపట్టాలని రామ్మోహన్ రావు కోరారు. గత ప్రభుత్వంలో వాల్ జరిగినవాల్ నిర్మాణం కళ్లముందు కనిపిస్తోందని, ఆనాడు పనిచేయించిన అధికారులు ఇప్పుడుకూడా ఉన్నారన్నారు. విజయవాడకు కీలక మైన రిటైనింగ్ వాల్ నిర్మాణం, ఫ్లైఓవర్, బుడమేరు వం తెన నిర్మాణం పనులను ప్రారంభించినఘనత చంద్రబా బునాయుడికే దక్కుతుంది తప్ప, ఎవరెంతగా తాపత్ర యపడినా ప్రజలు వారినిగుర్తించరని టీడీ పీఎమ్మెల్యే తేల్చిచెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు