తిరుమల కొండపైకి వెళ్ళేందుకు ఇకపై ఆ వాహనాలకు నో ఎంట్రీ..

మంగళవారం, 27 ఆగస్టు 2019 (18:19 IST)
తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదాలను నివారించే చర్యల్లో భాగంగా అధికారులు చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. సొంత వాహనాల్లో తిరుమల కొండపైకి వెళ్లి, స్వామి వారికి దర్శించుకోవడానికి వెళ్లే భక్తుల వాహనం 2003 సంవత్సరం కంటే ముందు నాటిదైతే, ఇకపై ఆ వాహనాలను తిరుమల కొండపైకి అనుమతించరట. పర్యావరణ పరిరక్షణ భాగంగా టీటీడీ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. 
 
2003 కంటే ముందు తయారైన, అలాగే కాలం చెల్లిన వాహనాలను నిన్నటి నుంచి (ఆగస్టు,26,2019) కొండపైకి అనుమతించటం లేదు. అలాంటి వాహనాలను విజిలెన్స్ అధికారులు అలిపిరి ఘాట్ రోడ్డు మొదటిలోనే నిలిపి చెక్ చేసి వెనక్కి పంపిస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల కాలం చెల్లిన వాహనాల కారణంగా సంభవించే ఘాట్ రోడ్డు ప్రమాదాలను చాలా వరకు నివారించవచ్చని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు