చంద్రబాబుకు సవాల్ విసిరిన విడదల రజని.. గుడివాడ మాదే

శనివారం, 8 జులై 2023 (21:03 IST)
ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని టీడీపీ అధినేత చంద్రబాబుకు సవాల్ విసిరారు. ఆరోగ్యశ్రీపై చర్చకు వచ్చే దమ్ముందా? అంటూ నారా లోకేశ్‌కు గతంలో సవాల్ విసిరిన ఆమె.. ఈసారి చంద్రబాబుకు సవాల్ విసిరారు. 
 
కృష్ణా జిల్లా గుడివాడలో 100 బెడ్ల ప్రభుత్వ ఆసుపత్రి-2ని మంత్రి విడదల రజని ప్రారంభించిన సందర్భంగా... ఆమె మాట్లాడుతూ.. చంద్రబాబుకు దమ్ముంటే తన ఐదేళ్ల పాలనలో ఏంచేశారో చెప్పాలని నిలదీశారు. ఆరోగ్యశ్రీ పేరెత్తే అర్హత చంద్రబాబుకు లేదని ఫైర్ అయ్యారు. 
 
చంద్రబాబు ప్రజల్లో నమ్మకం కోల్పోయారని రజనీ అన్నారు. ప్రస్తుతం ప్రజలను మోసం చేసేందుకు ప్రస్తుతం ఆయన మేనిఫెస్టో అంటూ నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. టీడీపీ నేతలు మాటలకే పరిమితం అని ఎద్దేవా చేశారు. గుడివాడలో కొడాలి నానిని ఓడించే సత్తా టీడీపీకి లేదని మంత్రి రజని అన్నారు.

వెబ్దునియా పై చదవండి