పవన్‌ను వేధిస్తున్న అనారోగ్య సమస్యలు.. కారణం ఏంటి?

సెల్వి

శుక్రవారం, 11 అక్టోబరు 2024 (21:41 IST)
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురువారం జరిగిన కేబినెట్ సమావేశానికి గైర్హాజరయ్యారు. ఆయన జలుబు, జ్వరంతో బాధపడుతున్నారని, విశ్రాంతి తీసుకుంటున్నారని అధికారిక వర్గాలు తెలిపాయి. 
 
ముంబైలో రతన్ టాటాకు అంతిమ నివాళులు అర్పించాల్సి ఉండగా వెళ్లలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ రతన్ టాటా అంత్యక్రియలకు వెళ్లారు. పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురికావడం ఇదే మొదటిసారి కాదు. 
 
కొద్ది రోజుల క్రితం, స్వామివారి దర్శనం కోసం తిరుమల కొండపైకి వెళ్లిన తర్వాత జ్వరం, వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. 
 
కనీసం నెలకు ఒక్కసారైనా పవన్ అనారోగ్యానికి గురవుతున్నట్లు తెలుస్తోంది. ఈ వేసవిలో ఎన్నికల ప్రచారంలో పవన్ వడదెబ్బ, డీహైడ్రేషన్, జ్వరం కారణంగా ప్రచారం ఆపేశారు. 
 
పవన్ కళ్యాణ్‌కు చాలా సంవత్సరాలుగా వెన్నునొప్పి సమస్యలు వేధిస్తున్నాయని టాక్. దీంతో సినిమాల్లో కాంప్లెక్స్ డ్యాన్సులు చేయడం కూడా మానేశారని సమాచారం. పవన్‌లో రోగనిరోధక శక్తి కూడా దెబ్బతింది. 
 
పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్-హైదరాబాద్ మధ్య తిరుగుతున్నారు. రీసెంట్‌గా సినిమాల షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు. ఇవన్నీ ఆయన శరీరాన్ని దెబ్బతీస్తున్నాయి. దీంతో ఆయన అనారోగ్య సమస్యలతో ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలుస్తోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు