ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ను కించపరిచేలా వ్యాఖ్యానించిన వైకాపా మాజీ మంత్రి గోరంట్ల మాధవ్పై ఏపీ పోలీసులు మరో కేసు నమోదు చేశారు. ఏపీ మంత్రి నారా లోకేశ్... ఆడవాళ్లకు అక్కా కాని, మగవాళ్లకు బావా కాని వ్యక్తి అని అన్నారు. అలాంటి వ్యక్తి జడ్ కేటగిరీ భద్రతను కల్పించి, సీఆర్పీఎఫ్ బలగాలను కేటాయించారని విమర్శించారు. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.